1000 ఫోర్ల శిఖరం: శిఖర్ ధావన్ అరుదైన రికార్డు
టీ20ల్లో 1000 ఫోర్లు బాదిన తొలి భారత క్రికెటర్గా పంజాబ్ కింగ్స్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ధావన్ ఈ ఘనత సాధించాడు.
టీ20ల్లో ఇప్పటివరకూ బౌండరీలు బాదిన దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు శిఖర్ కూడా చేరాడు. ఆ జాబితా వరుసగా క్రిస్ గేల్- 1132, అలెక్స్ హేల్స్-1054, డేవిడ్ వార్నర్ – 1005, ఆరోన్ ఫించ్- 1004, శిఖర్ ధావన్- 1000 కొట్టారు
ఇప్పటివరకూ ఈ మైల్స్టోన్ చేరుకున్న ఆటగాళ్ల జాబితాలో ధావన్ ఐదో స్థానంలోకి చేరాడు. ఈ జాబితాలో 1132 ఫోర్లతో యూనివర్సల్ బాస్ క్రిస్గేల్ తొలి స్థానంలో ఉన్నాడు.
ఇక మనవాళ్ల విషయానికి వస్తే 917 ఫోర్లతో విరాట్ కోహ్లి రెండో స్థానంలో నిలవగా, 875 ఫోర్లతో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నారు. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.